హిందువులకే శ్మశాన స్థలం కేటాయించాలి
1 min read
విహెచ్ పి ఆధ్వర్యంలో చెట్నిహల్లి నుంచి బిసిలు వెయ్యి మందికి పైగా పాదయాత్ర
- శ్మశాన స్థలం అక్కడే ఉండాలని, ఇచ్చిన పట్టాలు రద్దు చేయాలని డిమాండ్
– రెవెన్యూ రికార్డుల్లో రస్తా పోరంబోకు గా మార్పు
మంత్రాలయం, న్యూస్ నేడు : మండల పరిధిలోని చెట్నిహల్లి గ్రామంలో శ్మశాన వాటిక సమస్య పై విహెచ్ పి ఆధ్వర్యంలో గంగుల మల్లికార్జున, కురువ శివలింగప్ప, బోయ హనుమేష్, బెస్త తిక్కస్వామి, బెస్త కుమార స్వామిలచే ఏర్పడిన యూత్ కమిటీ నేతృత్వంలో బిసి లు పోరుబాట పట్టారు. సోమవారం విశ్వ హిందూ పరిషత్ సభ్యులతో కలిసి సుమారు వెయ్యి మందికి పైగా చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ మహిళలతో చెట్నిహల్లి గ్రామం నుంచి పాదయాత్రతో రాఘవేంద్ర సర్కిల్ మీదుగా తహసీల్దార్ వరకు ర్యాలీ చేపట్టి తహసీల్దార్ రవికి డిమాండ్ తో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 4 వందల ఏళ్లుగా గ్రామ పరిధిలో గల సర్వే నెంబరు 113లో 3.83 ఎకరాల భూమిని, సర్వే నెంబరు 114 ఎ లోని 1.02 ఎకరాల భూమిని శ్మశాన వాటిక గా వాడుతున్నామని గతంలోని రెవెన్యూ రికార్డుల్లో కూడా సంబంధిత సర్వే నెంబర్లు శ్మశాన వాటిక గా ఉందని, దాన్ని రెవెన్యూ అధికారులు మద్యలో అడంగల్ లో రస్తా పోరంబోకు గా మార్చారని తెలిపారు. బిసి ఎవరు చనిపోయినా అదే సర్వే నెంబరులో పూడ్చుతున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో అదే సర్వే నెంబర్ లో ఎస్సీలైన మాదిగ కులస్థులకు రెవెన్యూ అధికారులు ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా ఇష్టారాజ్యంగా ఇంటి పట్టాలు మంజూరు చేసి తప్పు చేశారని విమర్శించారు. ప్రస్తుతం ఎస్సీలు తమ ఇళ్ల ముందు మృతి చెందిన వారిని ఖననం చేయోద్దని ఆందోళనలతో గొడవలకు దిగుతున్నారని పేర్కొన్నారు. చివరికి మా గ్రామ పెద్దలు 50 మంది పై అక్రమ కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని ఆవేధన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్మశాన స్థలాన్ని వదిలేదే లేదని, ఎస్సీలకు ఇచ్చిన ఇంటి పట్టాలను రద్దు చేసి వేరే చోటుకు మార్చాలని డిమాండ్ చేశారు. ఈ విషయం పై విశ్వ హిందూ పరిషత్ ఆదోని జిల్లా కార్యదర్శి హనుమంత రెడ్డి, జిల్లా ప్రచార ప్రముఖ్ కసిరెడ్డి ఉపేంద్ర రెడ్డి ఇది కేవలం గ్రామ హిందువుల ఆందోళన అని సమస్య పరిష్కరించకుంటే ఆందోళన ఉదృతం అవుతుందని తహసీల్దార్ ను హెచ్చరించారు. సమస్య పరిష్కారానికి జిల్లా కలెక్టర్ కు నివేదిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు నందవరం ప్రఖండ కార్యదర్శులు శ్రీ రంగ రవికుమార్ ఖండ్ ఉపాధ్యక్షులు జగదీష్ ఖండ్ గోరక్షక్ ప్రముఖ్ గోవర్ధన్ నాయుడు, నందవరం మండల అధ్యక్ష కార్యదర్శులు రాజశేఖర్ స్వామి, గవ్వల నారాయణ గ్రామ సర్పంచ్ అంజిని ఉప సర్పంచ్ వీరనాగప్ప ఎంపిటిసి సభ్యులు రామాంజనేయులు మాజీ సర్పంచ్ భర్త గంగుల వెంకటేశ్ మాజీ ఉప సర్పంచ్ అల్లింగప్ప టిడిపి నాయకులు చేపల నాగేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
