సమస్యలను పరిష్కరించండి..విశ్రాంత ఉద్యోగుల ఆవేదన
1 min read
మిగతా శాఖల మాదిరి మాకు పదవీ విరమణ పెంచలేదు
ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం
సాంఘిక సంక్షేమ శాఖ రిటైర్డ్ ఉద్యోగుల ఆవేదన..
నందికొట్కూరు, న్యూస్ నేడు: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు కళాశాలల్లో పనిచేస్తూ 2018 నుండి పదవీ విరమణ చేసిన వారి సమస్యలను పరిష్కరించాలనిసాంఘిక సంక్షేమ శాఖ గురుకులం రిటైర్డ్ ఉద్యోగుల రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ అన్నారు.కర్నూలులో సీ క్యాంప్ జిల్లా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల కార్యాలయ ప్రాంగణంలో విశ్రాంత ఉద్యోగులు సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో గత 35 సం.గా పనిచేస్తూ పేద విద్యార్థులను బంగారు భవిష్యత్తుగా వారిని తీర్చిదిద్దేందుకు ఎంతగానో కృషి చేశామన్నారు.మిగతా శాఖల మాదిరిగా మాకు 62 సంవత్సరాలకు పదవీ విరమణ పెంచలేదని 2018 నుండి పదవీ విరమణ చేసిన వారికి ఇంతవరకు రావాల్సిన బెనిఫిట్స్ జీతాలు మెడికల్ రియంబర్స్మెంట్,డీఏ,ఎన్ కాస్మెంట్ తదితర బకాయిలు పెండింగ్ లో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్ర ట్రెజరర్ డి దుర్గా ప్రసాద్, జనరల్ సెక్రటరీ ఆర్ వెంకటేశ్వర రావు మాట్లాడుతూ 7 సం.ల నుండి మా సమస్యల్ని పరిష్కరించకపోవడం బాధాకరమని మిగతా శాఖల ఉద్యోగులకు ఒకటవ తేదీనే జీతాలు వస్తున్నాయని మాకు అలా జీతాలు రాకపోవడం వల్ల ఆర్థిక సమస్యలతో మా కుటుంబాలు ఇబ్బందులతో ఎదుర్కొంటున్నామని అన్నారు.మిగతా ఉద్యోగుల మాదిరే మా సమస్యల్ని సమాన న్యాయంతో పరిష్కరించాలన్నారు. ప్రభుత్వం మా సమస్యల్ని అర్థం చేసుకొని 2018 నుండి ఉన్న మా సమస్యలను పరిష్కరించాలని గురుకులం సంక్షేమ శాఖ రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు రామ సుబ్బారెడ్డి,శ్రీనివాసరెడ్డి, దేవరాజు,రంగస్వామి వాసు దేవరెడ్డి,తిరుపాలయ్య, విజయరత్నం,మల్లికార్జున శర్మ శ్రీలత,సువేద తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.