PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజలు కోరుకున్న పాలనకు… రేపటితో 100 రోజులు

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆలూరు: ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జి బి. వీరభద్ర గౌడ ఆరు మండలాల పర్యటన షెడ్యూల్..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వీరభద్ర గౌడ గారి సమక్షంలో ఆరు మండలాల పర్యటన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో సాధించిన విజయాలు, తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని   అదేవిధంగా వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఆరు  మండలాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తిప్పికొట్టాలన్నారు. టీడీపీ పార్టీ నాయకులు, మిత్రపక్ష పార్టీలు బీజేపీ, జనసేన, నాయకులు, కార్యకర్తలు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటు, ప్రజల ప్రతీ సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు.రేపటినుండి…ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వీరభద్ర గౌడ పర్యటన షెడ్యూల్…

1) 20-09-2024- శుక్రవారం. హాలహర్వి టౌన్, హాలహర్వి మండలం.

2) 21-09-2024- శనివారం. మొలగవెల్లి విల్లెజ్, ఆలూరు మండలం.

3) 22-09-2024-ఆదివారం పెద్ద హోతూరు. ఆలూరు మండలం

4) 23-09-2024-సోమవారం. హలిగేర విల్లెజ్, ఆస్పరి మండలం.

5) 24-09-2024- మంగళవారం. హొళగుంద టౌన్, హొళగుంద మండలం.

6) 25-09-2024- బుధవారం. దేవనకొండ టౌన్, దేవనకొండ మండలం.

7) 26-09-2024- గురువారం. రామదుర్గం విల్లెజ్, చిప్పగిరి మండలం.

ఈకార్యక్రమానికి ఆరు మండలాల కన్వినర్లు,టీడీపీ నాయకులు,బీజేపీ,జనసేన నాయకులు,కార్యకర్తలు అలాగే క్లస్టర్ ఇంఛార్జిలు, యూనిట్ ఇంచార్జిలు,బూత్ ఇంచార్జిలు మరియు తెలుగు యువత, Itdp,Tnsf,Tntuc, నందమూరి,నారా,BVG అభిమానులు వివిధ హోదాలలో ఉన్న ప్రతి ఒక్క TDP నాయకులు,కార్యకర్తలు పాల్గొనాలని ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జి బి. వీరభద్ర గౌడ పిలుపునిచ్చారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *