PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పార్థసారథి  నాయకత్వం నచ్చి బిజేపి పార్టీలోకి 150 కుటుంబాలు చేరిక

1 min read

పల్లెవెలుగు వెబ్ పగిడ్యాల: పగడాల నీలకంఠ  ఆధ్వర్యంలో కల్లుబావి, విజయభాస్కర్ రెడ్డి కాలనీ నుండి 150 కుటుంబాలు భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ కావడం జరిగింది.భారతీయ జనతా పార్టీ భారతదేశంలో చేస్తున్న అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశంలోని ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందటం, మైనారిటీలకు కూడా సుఖ సంతోషాలతో ఉండడం సబ్కా సాత్ ,సబ్కా వికాస్, సబ్కా వికాస్ అనే నినాదం మెచ్చి,దానికి తోడు ఆదోనిలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారధి  ఆదోని అభివృద్ధిలో ఆయన చేసిన కృషిని చూసి, అభివృద్ది లో ఆయన పట్టుదల నచ్చి భారతీయ జనతా పార్టీలో ఈరోజు చేరడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు నాగరాజుగౌడ్, ఎక్స్ MPP పంపాపతి,జిందే సాయికుమార్, వెళ్ళాల మధుసూదన్ శర్మ , చిన్న ,కిట్టు తదితరులు పాల్గొన్నారు.

About Author