PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

21న ఆరవ తరగతికి ప్రవేశ పరీక్ష

1 min read

పల్లెవెలుగు వెబ్  మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రమైన ఏపీ మోడల్ పాఠశాలలో ఆరవ తరగతి ప్రవేశ పరీక్షకు ఈనెల 21న ఆదివారం నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్.సలీం భాష శుక్రవారం తెలిపారు.6వ తరగతిలో చేరుటకు ఆన్ లైన్ లో నమోదు చేసుకున్న విద్యార్థులందరూ హాల్ టికెట్లను తీసుకొని రావాలని అదే విధంగా ఆధార్ ఒరిజినల్ కార్డు తప్పని సరిగా తీసుకురావాలని ఉ.10 నుంచి 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందని ఉదయం 9 గంటలకు విద్యార్థులు పాఠశాలకు చేరుకోవాలని ప్రిన్సిపాల్ అన్నారు.ఈ ప్రవేశ పరీక్షలో విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించడం జరుగుతుందని ప్రిన్సిపాల్ సలీం భాష తెలిపారు.

About Author