PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

29 నుంచి అగ్ని వీర్ ఎంపికలు

1 min read

పల్లెవెలుగు, వెబ్​: కేంద్ర ప్రభుత్వం ఆర్మీలో చేరే వారికి అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆర్మీ సైన్యంలో చేర యువత కోసం అగ్ని వీర్ ఎంపికలను ఈనెల 29 నుంచి జనవరి 15వ తేదీ వరకు నిర్వహించనుంది కేంద్రం. ఈ అగ్ని వీర్ ఎంపికలను… జనవరి 15 వరకు సికింద్రాబాద్ ఆర్మీ ఆర్డినెన్స్ కోర్ కేంద్రంలోని ఏబిసి ట్రాక్ లో నిర్వహించనున్నట్లు ఏఓసి కేంద్రం ప్రకటన చేసింది. హెడ్ క్వార్టర్స్ కోటా కింద అగ్ని జనరల్ డ్యూటీ, ట్రేడ్స్ మెన్, టెక్ మరియు క్రీడాకారుల విభాగాల్లో ఔత్సాహిక యువతి యువకులు ర్యాలీలో పేర్లు నమోదు చేసుకోవచ్చు అని పేర్కొంది. 17 సంవత్సరాలు నుంచి 23 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు మాత్రమే ఈ పోస్టులకు అర్హులని పేర్కొంది. అగ్ని వీర్ జీడి, ట్రేడ్స్ మెన్ కు పదవ తరగతి అర్హత కాగా… టెక్ కి సైన్యంలో ఇంటర్ పాస్ అయి ఉండాలి.

About Author