PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

49 బన్నూరు రెవెన్యూ సదస్సుకు స్పందన..

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు (నందికొట్కూరు): నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని 49 బన్నూరు గ్రామంలో బుధవారం జరిగిన రెవెన్యూ సదస్సుకు రైతుల నుండి విశేష స్పందన లభించింది.ఆర్ఐ జహంగీర్ భాష,మండల సర్వేయర్ కృష్ణుడు,రీ సర్వే డిప్యూటీ తహసిల్దార్ సునీల్ రాజా రెవెన్యూ సదస్సుకు హాజరై రైతుల నుండి వినతులను స్వీకరించారు.ఈ సదస్సుకు మొత్తం-71 దరఖాస్తులు వచ్చినట్లు ఆర్ఐ తెలిపారు.పొలాల్లో విస్తీర్ణం తక్కువ,ఎక్కువగా ఉండడం మరియు కొత్త పాస్ పుస్తకాల కొరకు మరియు తదితర సమస్యల గురించి దరఖాస్తులు వచ్చినట్లు ఆయన తెలిపారు.పొలాల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఆర్ఐ తెలిపారు.ఈ రోజు గురువారం చెరుకుచెర్ల గ్రామంలో రెవెన్యూ సదస్సు ఉందని పొలాలకు ఉన్న సమస్యల గురించి వినతి రూపంలో అర్జీలు ఇవ్వాలని తహసిల్దార్ శ్రీనివాసులు తెలిపారు.ఈ కార్యక్రమంలో వీఆర్వోలు సోఫీ సాహెబ్, రామకృష్ణ,గ్రామ టిడీపీ నాయకులు రమణారెడ్డి,సోఫీ సాహెబ్,గ్రామ సర్వేయర్ అజీమ్ పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *