PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వరద బాధితుల సహాయార్ధం 5 వేల రూ విరాళం అందజేత      

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : విజయవాడ బుడమేరు వరద బాధితుల సహాయార్ధం పత్తికొండ రాఘవ కళా సమితి నాటక రంగ కళాకారులు 5000రూపాయలు విరాళం అందించారు.ఈ మేరకు సోమవారం స్థానిక నాలుగు స్తంభాల మండపం వద్ద కళాకారులు వరద బాధితుల కోసం తమకు తోచిన సాయంగా ఐదు వేల రూపాయలు విరాళం పంపుతున్నమని చెప్పారు. ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత తో వరద బాధితుల కోసం తమ వంతు సాయం అందించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాఘవ కళా సమితి కళాకారులు లక్ష్మీనారాయణ, హార్మోనిస్ట్ కాశప్ప, శ్రీరాములు, లక్ష్మన్న, మౌలాలి తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *