PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

70 మంది యువకులు జనసేన పార్టీలో చేరిక

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు మున్సిపాలిటీ పరిధిలో 20వ వార్డుకు చెందిన 70 మంది యువకులు జనసేన పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గ ఆశయాలు నచ్చి అ వార్డు ఇంచార్జ్ బోయ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం జనసేన పార్టీలో చేరారు. వారికి జనసేన పార్టీ ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింత సురేష్ బాబు  స్థానిక బిర్లా కాంపౌండ్ జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తుందని ప్రభుత్వం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటుంది అని తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క జనసేన కార్యకర్తపై ఉంటుందన్నారు. ప్రతి ఒక్క జన సైనికుడు అందరూ కలిసి రానున్న రోజుల్లో జనసేన పార్టీని గ్రామ గ్రామాల్లో తీసుకెళ్లి ప్రజలకు మేమున్నామని భరోసా కల్పించే దిశగా పనిచేయాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటరమణ శేఖర్ దస్తగిరి మౌలాలి మురళి తదితరులు పాల్గొన్నారు.

About Author