PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పూజ్యగురూజీ తేజోమయానంద స్వామి జీ 74వ జన్మదిన వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు లోని చిన్మయ మిషన్ లో ఘనంగా నిర్వహించారు. స్వామిజీ జన్మదినం సందర్భంగా చిన్మయ మిషన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు కు చెందిన ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ పాల్గోని ఆద్యాత్మిక శక్తి గురించి వివరించారు. నిత్యం దైవ చించన, భగవంతుని స్లోకాలు పలకడం వల్ల ఆద్యాత్మిక శక్తి పెరుగుతుందని శంకర్ శర్మ తెలిపారు. చిన్మయ మిషన్ అభివృద్ధి కి దాతలు ముందుకు రావాలని డాక్టర్. శంకర్ శర్మ కోరారు. ఈసందర్భంగా చిన్నారులకు ఆయన ఆద్యాత్మిక పుస్తకాలను పంపిణీ చేశారు.   ఈకార్యక్రమంలో సుప్రేమానంద సరస్వతి, విజయ్ కుమార్ రెడ్డి, నాగరూరు శ్రీనివాస్, రత్నప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

About Author