PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బొగ్గు కొరత ప్రభావం..కడప థర్మల్​పవర్​ప్లాంట్​లో తగ్గిన విద్యదుత్పత్తి!

1 min read

పల్లెవెలుగువెబ్​, కడప: దేశంలో బొగ్గు కొరత ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోని థర్మల్​ విద్యుత్​ కేంద్రాల్లో ఉత్పత్తి శాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని, ఫలితంగా విద్యుత్​ సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్రం హెచ్చరిస్తోంది. కడప రాయలసీమ థర్మల్​ పవర్​ ప్లాంట్​లో బొగ్గు కొరత కారణంగా కేవలం నాలుగు యూనిట్ల ద్వారా మాత్రమే విద్యుత్​ను ఉత్పత్తి చేస్తున్నారు. మిగిలిన రెండు యూనిట్లను అధికారులు నిలిపివేశారు. నాలుగు యూనిట్ల నుంచి 670మెగావాట్ల విద్యుత్​ను గ్రిడ్​కు అందిస్తున్నారు. కడప థర్మల్​ పవర్​ ప్లాంట్​లో మొత్తం ఆరు యూనిట్లు ఉన్నాయి. ఇందులో 210మెగావాట్ల సామర్థ్యం గల యూనిట్లు 5, 600మెగావాట్ల సామర్థ్యం గల యూనిట్​ ఒకటి చొప్పున్నాయి. అయితే మొత్తం 1650మెగావాట్ల సామర్థ్యం గల కడప పవర్​ ప్లాంట్​లో ప్రస్తుతం బొగ్గు కొరత నేపథ్యంలో నాలుగు యూనిట్ల నుంచి కేవలం 670మెగాట్ల విద్యుత్​ను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. కాగా రాష్ట్రంలోని 5010మెగావాట్ల సామర్థ్యం గల అయిదు థర్మల్​ పవర్​ప్లాట్లకు 20ర్యాక్స్​ బొగ్గు సరఫరా చేయాలని ఏపీ కేంద్రానికి కోరింది. అయితే బొగ్గు ఆశించిన స్థాయిలో సరఫరా లేకపోవడంతో విద్యుదుత్పాదక రేటు గణనీయంగా తగ్గుతోంది. ఈ క్రమంలో విద్యుత్​ యూనిట్​ ధర రూ.4.50 నుంచి రూ.20లకు పెరిందని ఏపీ పేర్కొంటోంది. బొగ్గు కొరత రానున్న వేసవిలో ఎలాంటి సంక్షోభాన్ని తెస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతుంది.

About Author