PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ పత్రం అందజేత..

1 min read

పెద్ద ఎత్తున పాల్గొన్న పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : దెందులూరు నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఎం ఎల్ ఏ అభ్యర్థిగా ఆలపాటి నరసింహ మూర్తి గురువారం నామినేషన్ వేశారు.తన నామినేషన్ పత్రాన్ని దెందులూరు ఆర్ ఓ లావణ్య వేణికిఅందజేశారు. ఆలపాటి వెంట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్. ఆలపాటి నరసింహ మూర్తి కుమార్తె తదితరులున్నారు. ఆలపాటి నామినేషన్ వేడుక అంగరంగ వైభోగంగా జరిగింది. మండూరు నుండి కార్లు. ద్విచక్ర వాహనాల తో భారీ ర్యాలీగా బయలు దేరింది. ఆలపాటి నరసింహ మూర్తి కి తన స్వగ్రామం మైన మండూరు లో ను.జోగన్నపాలెం వంతెన వద్ద. 7వ మైలు రాయ్ దగ్గర. గంగన్న గూడెం.నాగుల దేవునిపాడు. మీదుగా,గాలాయగూడెం.గోపన్న పాలెం. వేగవరం.సోమవరపాడు. గ్రామాలలో ప్రజలు పెద్ద ఎత్తున  స్వాగతం పలికారు.గోపన్న పాలెం సెంటర్ లోనరసింహమూర్తి అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్య కర్తలు సుమారు గంటన్నర పాటు బాణా సంచా కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నరసింహ మూర్తి దెందులూరు ఎం ఎల్ ఏ గా నామినేష వేసిన సందర్భంగా మాండూరులో పండుగ వాతావరణం నెలకొంది. ఆలపాటి నామినేషన్ తో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నియోజక వర్గం లో స్వీట్లుపంచారు. మహిళల పెద్ద ఎత్తున పాల్గొని ఆయనకు ఘన స్వాగతం పలికారు. వందలాదిమంది పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.

About Author