PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జలదుర్గం గ్రామ చెరువు సందర్శించిన టిడిపి నాయకులు

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: ప్యాపిలి మండలం, జలదుర్గం గ్రామ చెరువు లో నీరు లీక్ అవుతున్నా కారణంగా బోర్లు ఎండిపోయి చెరువు నీటి కొరతతో  రైతులకు పంట నష్టం వాటిల్లింతుండటంతో  డోన్ నియోజకవర్గ టిడిపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి, తెలుగుదేశంపార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి , రాష్ట్ర టిడిపి కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్ జలదుర్గం రైతులు, టిడిపి నాయకులతో శనివారం కలిసి చెరువును‌ సందర్శించి ,పంటపొలాలను పరిశీలనా చేశారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెరువును మరమ్మతుల పనులు చేసే బాధ్యత టిడిపి ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆర్ఇ రాఘవేంద్ర, ఆర్ యు నాగరాజు, టిడిపి నాయకులు అలీబాల్ పరమేష్ ,రమణ గౌడ్, మురళి కృష్ణ గౌడ్ , గండికోట రామసుబ్బయ్య , టిడిపి యువ నాయకులు భరత్ రెడ్డి,సలీం, జలదుర్గం శివ, తెలియక నాయకులు కార్యకర్తలు, గ్రామ‌రైతులు తదితరులు పాల్గొన్నారు.

About Author