PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీడీపీ కూటమి నానా జాతి సమితి ఒకవైపు.. మంచి చేసిన మేము ఒక వైపు

1 min read

మనం ఒంటరిగానే వస్తున్నాం ఆశీర్వదించండి

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలం ఎల్లార్తి గ్రామంలో  వైస్సార్సీపీ MLA అభ్యర్థి  శ్రీ బుసినే విరుపాక్షి  నిర్వహించిన గడప గడప ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు రాజశేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్ వైకుంఠం , అశోక్ రెడ్డి,రంగస్వామి, నూరి, రవి, శేషి , శేషు, అనంద్, పురుషోత్తం, మియా, వీరేష్, రామ, నిజాం,శైక్షవాలి, సయ్యద్,  నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.ఈరోజు ఆలూరు నియోజకవర్గం హోలగుంద మండల ఎల్లర్తి గ్రామంలో గడపగడపకు  ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విరుపాక్షి  మాట్లాడుతూ కూటమికి అజెండా లేదని దుయ్యబట్టారు. అధికారం కోసమే పొత్తులతో టీడీపీ కూటమి నానా జాతి సమితి ఒకవైపు.. మంచి చేసిన మేము ఒక వైపు. నానాజాతి  సమితి అంతా కలిసి అధికారం కోసమే ఎన్నికల్లో పోటీ చేస్తుంది’’ అని విరుపాక్షి ఎద్దేవా చేశారుకూటమి అభ్యర్థులకు  ఎంత మంది కూటమికి మద్దతు ఇచ్చినా మాకు నష్టం లేదు. ఎంతమంది కలిసొచ్చినా ఒరిగేదేమీలేదు. ఏపీ పొలిటికల్‌ తెరపై ఇప్పడు ఒక క్లారిటీ వచ్చింది. ఏపీ రాజకీయ తెర మీద జగన్ ఒక్కడే ఉన్నారు. తోడేళ్లు, గుంట నక్కలు, ముళ్ల పందులు అన్ని ఏకమై అటు వైపు ఉన్నాయి అని విరుపాక్షి  అన్నారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author