PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లేని పోని ఆరోపణలు చేస్తే తగిన గుణపాఠం చెబుతాం

1 min read

డబ్బులు తీసుకుని పదవులు ఇచ్చారు

వ్యక్తి గత విషయంలో తెలుసుకుని మాట్లాడితే మంచిది

మాజీ జడ్పీటీసీ సభ్యులు మాలపల్లి లక్ష్మయ్య

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం : బిసి నాయకులు పై లేని పోని ఆరోపణలు చేస్తే తగిన గుణపాఠం చెబుతామని వైకాపా మండల అధ్యక్షులు బీంరెడ్డి ని మాజీ జడ్పీటీసీ సభ్యులు మాలపల్లి లక్ష్మయ్య హెచ్చరించారు. శుక్రవారం మండల పరిధిలోని మాలపల్లి గ్రామంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాలపల్లి లో వైకాపా మండల అధ్యక్షులు బీంరెడ్డి తన పై చేసిన ఆరోపణలను ఖండించారు. బీంరెడ్డి వ్యక్తి గత విషయంలో మాట్లాడే తప్పుడు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. బాలనాగిరెడ్డిని ఎమ్మెల్యే చేయాలని పది సంవత్సరాలు కష్టపడి తే పదవులు ఇచ్చారని దీని కోసం ఐదు లక్షల రూపాయల ఇచ్చానని తెలిపారు. నా పిల్లల చదువులకు కాని వాహనాలకు కాని డబ్బులు ఇచ్చినట్లు నిరుపించాలని సవాల్ విసిరారు. నా సొంత డబ్బులతో నా పిల్లలను చదివించుకున్నాని తెలిపారు. మీకు చేసిన ఆరోపణలు నిజమని మంత్రాలయం రాఘవేంద్ర స్వామి బృందావనం పై ప్రమాణం చేయగలర అని సూచించారు. ఇవ్వలేదని నేను రాఘవేంద్ర స్వామి బృందావనం పై ప్రమాణం చేస్తానని సవాల్ విసిరారు. బీంరెడ్డి రెడ్డి బిసి ల వ్యక్తి గత విషయంలో లేని పోని ఆరోపణలు చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఈ సమావేశంలో టిడిపి జిల్లా నాయకులు ఎస్ యం గోపాల్ రెడ్డి, టిడిపి నాయకులు చంద్ర, లక్ష్మయ్య, కృష్ణ, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author