PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైభవంగా హనుమజ్జయంతి ఉత్సవాలు

1 min read


పల్లెవెలుగు వెబ్ చెన్నూరు:  మండల కేంద్రమైన చెన్నూరు బ్రాహ్మణ వీధిలో వెలసియున్న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం నందు  శనివారం హనుమజ్ఞయంతి ఉత్సవాలు వైభవంగా ఆలయ కమిటీ సభ్యులు ప్రజలు నిర్వహించారు. పుష్పగిరి పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ అభినవ ఉద్దండ విద్య శంకర భారతి స్వామి వారి ఆశీస్సులతో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఉదయం ఐదు గంటలకు వేద పండితులు సుప్రభాత సేవతో పూజలు నిర్వహించారు. ఉదయం ఐదున్నర గంటలకు మూల విరాట్ విగ్రహములకు అభిషేక మరియు అలంకరణ భక్తులు చూస్తుండగా వేద పండితులు ఘనంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు ఆలయానికి వచ్చే భక్తులకు సర్వదర్శనం ఏర్పాట్లు చేశారు. ఉదయం 8:30 గంటలకు శ్రీ ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహమునకు వేద పండితుల చేతుల మీదుగా అలయ కమిటీ ఆలయ కమిటీ సభ్యుడు చంద్రమౌళీశ్వర స్వామి వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. భక్తులు తీసుకువచ్చినపంచామృతాన్ని ఒక గ్లాసులో స్వయంగా తమ ఇంటి వద్దనే తయారు చేసుకొని ఆలయానికి వచ్చి ఉత్సవ విగ్రహానికి తమ స్వహస్తాలతో స్వయంగా అభిషేకం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అభిషేక పూజల్లో పాల్గొన్నారు.మధ్యాహ్నం 12 గంటల నుంచి చెన్నూరు కు చెందిన గలిజర్ల సాంబరాజు వారి కుటుంబ సభ్యులు చేతుల మీదుగా అన్న ప్రసాద వితరణ చేశారు. సాయంత్రం నాలుగు గంటల నుంచి శ్రీ ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాన్ని గ్రామ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ ఊరేగింపులో నెల్లూరు బృందం వారిచే కోలాటం ప్రజలను ఆకట్టుకుంది. పెన్నా నది ఒడ్డున వెలసిన ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెన్నూరు మండలం బుడ్డాయిపల్లి జాతీయ రహదారిపై వెలసిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రామనపల్లి గ్రామంలో వలసిన ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల వ్యాప్తంగా హనుమాన్ జయంతి ప్రజలు వైభవంగా జరుపుకున్నారు.

About Author