పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే..మాండ్ర
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని సంగమేశ్వరం దేవాలయం మరియు కొలనుభారతిలో గురువారం ఉదయం నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య మరియు మాండ్ర దంపతులు నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి శివానందరెడ్డి,మాండ్ర ఉమాదేవి ఆలయాల్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మొదటిసారిగా అక్కడ పూజలు నిర్వహించారు. ఆలయ వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఆలయ పండితులు వీరిని శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,పలుచాని మహేశ్వరరెడ్డి మరియు మండల నాయకులు పాల్గొన్నారు.