PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

18 నుంచి 21వరకు  తితిదే ధార్మిక కార్యక్రమాలు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఈ నెల 18వ తేదీ నుండి 21వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆదోని మండలం, విరూపాపురం గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం నందు నాలుగు రోజుల పాటు ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ కార్యనిర్వాహకులు డాక్టర్ మల్లు వేంకటరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఇస్కాన్ ధర్మ ప్రచారకులు నిత్యతృప్తదాస్ చే మూడు రోజులపాటు శ్రీమద్రామాయణం, మహాభారతం, భగవద్గీతలపై ధార్మిక ప్రవచనాలు, స్థానిక భజన మండలిచే భజనలు,  శుక్రవారం గోపూజ మరియు కుంకుమార్చన కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన కరపత్రాలను స్థానిక భక్తులతో ఆవిష్కరింప చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మ ప్రచార మండలి సభ్యులు న్యాయకంటి భీమిరెడ్డి, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

About Author