PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిరాశ్రయులకు బట్టలు, బిర్యాని పంపిణీ

1 min read

మాజీ రాష్ట్ర అటవీశాఖ డైరెక్టర్ శ్రీలక్ష్మి దంపతులు

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని రామనపల్లె గ్రామానికి చెందిన మాజీ రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్ రామన శ్రీలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో బుధవారం ఉదయం నిరాశ్రయులకు భోజనంతోపాటు బట్టలు పంపిణీ చేశారు, ఈ సందర్భంగా శ్రీలక్ష్మి మాట్లాడుతూ, కమలాపురం శాసనసభ్యులు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని, ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ఇంకా మంచి ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ నిరాశ్రయులైన పేదలకు బట్టల తో పాటు భోజనాలు పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు, అదేవిధంగా పుత్తా కృష్ణ చైతన్య రెడ్డిని కలసి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని ఆమె అన్నారు, పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి నేతృత్వంలో కమలాపురం నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి బాటలో కొనసాగడం తద్యమని, నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆయన అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు తెలుసుకుని వారి కష్ట సుఖాలను పాలుపంచుకొని, ఆ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తున్నారని ఆమె తెలిపారు, భవిష్యత్తులో కమలాపురం నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఆమె ఆకాంక్షించారు, ఈ కార్యక్రమంలోపుత్తా  మహేందర్ రెడ్డి, శీలం చంద్ర, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు .

About Author