PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజలకు సేవలు అందించడమే రెవెన్యూ శాఖ లక్ష్యం

1 min read

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం:  ప్రజలకు సేవలు అందించడమే రెవెన్యూ శాఖ లక్ష్యమని మంత్రాలయం తహశీల్దారు శ్రీధర్ మూర్తి అన్నారు. గురువారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ దినోత్సవాన్ని  రైతుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవిన్యూ శాఖ అందిస్తున్న సేవల గురించి మరియూ ప్రాముఖ్యత గురించి తెలిపారు. రైతులు తమశాఖ నుండి ఇంకా ఏమి ఆశిస్తున్నారో, ఎలాంటి సేవలు ఆశిస్తున్నారో, ఎలాంటి లోటుపాట్లు ఎదుర్కొంటున్నారో కూడా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రజలకు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలు  వాటిలో తీర్చగల వాటిని వీఆర్వోలతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించడం జరిగిందన్నారు. భవిష్యత్తు లో కూడా రైతులకు ప్రజలకు మరింత అందుబాటులో ఉంటూ సేవలు కొనసాగిస్తామని, అంకితభావంతో పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author