PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహానంది దేవస్థానంలో ఇద్దరు ఉద్యోగుల సస్పెండ్

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది:  ముగ్గురు తొలగింపుటకు రంగం సిద్ధం. పల్లె వెలుగు మహానంది. మహానంది దేవస్థానంలో పనిచేసే ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు విశ్వాసనీయ సమాచారం. ముగ్గురు ఏజెన్సీ ఉద్యోగులను తొలగించడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. మహానంది దేవస్థానంలో బుధవారం సాయంత్రం ఆలయ ఈవో శ్రీనివాస్ రెడ్డి తనిఖీ నిర్వహించినట్లు సమాచారం. ఇందులో భాగంగా దాదాపు 309 చిన్న లడ్డు మరియు 4190 నగదు తనిఖీల్లో భాగంగా తక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. ఉదయం షిఫ్టులో పనిచేసే ఒక ఆలయ ఉద్యోగి డ్యూటీ అనంతరం నగదు డిపాజిట్ చేయకపోవడంతో పాటు చిన్న లడ్డులు 309 తక్కువగా ఉన్న కారణంగా మరో ఉద్యోగిని తనిఖీల అనంతరం సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది.  విధులలో ఉండాల్సిన ఏజెన్సీ ఉద్యోగులు ముగ్గురు ఇతర చోట్ల ఓ… బృహత్తర కార్యక్రమంలో నిమగ్నమై విధులకు దూరంగా ఉన్నారని గుర్తించి వారిని విధుల నుంచి దూరం/ తొలగింపు చేయనున్నట్లు సమాచారం.

About Author