PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యసంస్థలు బంద్ విజయవంతం

1 min read

ఐక్య విద్యార్థి సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్ లో భాగంగా

AISF–SFI ఆధ్వర్యంలో హోళగుంద మండలంలో విద్యసంస్థలు బంద్ విజయవంతం

అసమర్ధ  (NTA) నెట్ వెంటనే రద్దు చేయాలి….AISF–SFI

కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.AISF–SFI

పల్లెవెలుగు వెబ్  హొళగుంద : ఈ సందర్భంగా AISF జిల్లా ఉపాధ్యక్షుడు పి.శ్రీరంగ SFI జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున AISF మండల కార్యదర్శి సతీష్ కుమార్ మాట్లాడుతూ నీట్ (NEET)కోసం విద్యార్థులు ఏళ్ల పాటు చదువుతారు. నీట్ (NEET)పేద విద్యార్థుల కోసం కాదు. ఉన్నంత వర్గాల కోసం అనే విధంగా కేంద్ర ప్రభుత్వం మార్చింది. ఇలా అయితే పేద విద్యార్థులు నీట్ (NEET)పై నమ్మకాన్ని కోల్పోతారు అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఇటీవలే నీట్ (NEET).. పరీక్షలు రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి.పి.హెచ్.డి అడ్మిషన్ల  కోసం ఇటువలె ఆమోదించిన తప్పనిసరి నెట్ స్కోర్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి. టి ఐ ఎస్ ఎస్ ఐఐటి ముంబై నుండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వరకు విద్యార్థి సంఘాల నేతలపై అక్రమ కేసులు నిర్బందనాలు యూనివర్సిటీ వ్యక్తికరణ  ప్రజాస్వామ్య అనిచివేత చర్యలు ఆపాలి. పాఠశాలల మూసివేతను కేంద్ర ప్రభుత్వం ఆపాలి.కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షలు నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలి.వారు డిమాండ్ చేశారు.అదేవిధంగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత ఐదేళ్లలో 65 సార్లు పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయని దీనిపైన పార్లమెంటులో ప్రధానమంత్రి మోడీ గారు చర్చించి న్యాయం చేయాలని వారు కోరారు. లీకేజీలతో విద్యార్థులు నష్టపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఉద్యమాలతో కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకువచ్చి విద్యార్థులు నష్టపోకుండా విద్యార్థులకు అండగా ఉండి ఐక్య విద్యార్థి సంఘాల  అఖిల భారత విద్యార్థి సమాఖ్య (AISF) భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) ఆధ్వర్యంలో భారీ పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామని వారు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో AISF మండల సహాయ కార్యదర్శి రాజేష్ AISF మండల ఉపాధ్యక్షులు అజయ్ మల్లయ్య AISF SFI నాయకులు రాజు అజయ్ మంజు తదితరులు పాల్గొన్నారు.

About Author