PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కార్పొరేట్ స్కూలు కు దీటుగా ప్రభుత్వ పాఠశాల లో విద్య బోధన

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: కార్పొరేట్ స్కూలు కు దీటుగా ప్రభుత్వ పాఠశాల లో  విద్యార్థులకువిద్య బోధన తోపాటు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగులు ప్రభుత్వ ఉచితంగా అందిస్తుందని సీనియర్ టిడిపి నాయకులు లక్ష్మీనారాయణ యాదవ్ అన్నారు.ప్యాపిలీ మండల పరిధిలోని చండ్రపల్లి గ్రామం లో శుక్రవారం  విద్యార్థిని, విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగులు పంపిణి కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎన్ డిఎ కూటమి నాయకులు, టిడిపి సీనియర్ నాయకులు లక్ష్మి నారాయణ యాదవ్  మాట్లాడుతు రాష్ట్రం లోని అన్ని పాఠశాలలకు విద్యార్థులకు నూతన ప్రభుత్వం స్టూడెంట్ కిట్ పేరుతో బ్యాగ్, బుక్స్, యూనిపామ్, బెల్ట్, షు విద్యార్థులకు అవసరమైన వస్తువులను ఈ ప్రభుత్వం అందిస్తుందని లక్ష్మి నారాయణ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమం లో  బిజెపి మండల అధ్యక్షులు కే. బి. దామోదర్ నాయుడు, సందీప్, సురేంద్ర, బాలిరెడ్డి, రామసుబ్బయ్య, లక్ష్మయ్య, నరేష్,సుంకన్న,లక్ష్మణ స్వామి,రామోహన్ తదితరులు పాల్గొన్నారు.

About Author