PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాదాసి కురువలపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి..

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : కర్నూలు జిల్లా నందవరం మండలం జోహరాపురం మా దాసి కురువ సామాజిక వర్గం వారిపై దాడి చేసినఅగ్రవర్ణాల నిందితులను అరెస్ట్ చేసి కఠినంగాశిక్షించాలి అని ఆలూరు తాలూకా మదాసి కురువ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా మాదాసి కురువ సంఘం తాలూకా ప్రధాన కార్యదర్శి మల్లయ్య,మండలం సలహాదారుడు శేషప్ప, మాదాసి కురువ సంఘం యువ నాయకుడు బసవరాజ్,కనక శ్రీ యూత్ నాయకుడు ఎస్కే గిరి. మాదాసి కురువ సంఘం మండల అధ్యక్షుడు పంపాపతి, చిన్నహ్యట మాజీ సర్పంచ్ వీరభద్రప్ప,మాట్లాడుతూకర్నూలు జిల్లా నందవరం మండలం జోహరాపురం గ్రామస్తులను వెటకోడవల్లుతో దాడి చేసిన అగ్రవర్ణాల వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.పోలం విషయంలో కురువ మల్లేష్,కురువ నాగేంద్ర,కురువ పరమేష్ మహిళలు సరస్వతమ్మ,పెద్ద రాములమ్మ కురువ సామాజిక వర్గానికి చెందినవారు పొలం విషయంలో అగ్రవర్ణాలకు చెందిన సంజీవరెడ్డి,బాలు రెడ్డి, అర్జున్ రెడ్డి,రాఘవరెడ్డి, రామకృష్ణ రెడ్డి తదితరులు కొడవళ్లు,రాడ్లు,కర్రలతో దాడి విశారాని ఆరోపించారు.దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీ ని కోరారు.ఈ కార్యక్రమంలో హొళగుందా మండలం మాదాసి కురువ సంగం సహాయ కార్యదర్శి గాది, సంఘం నాయకుడు గాదిలింగప్ప,మండలం ఉప అధ్యక్షలు రవి,సంఘం సలహాదారుడు రామాంజనేయులు,డాక్టర్ చంద్రశేఖర్,మండల కార్యదర్శి మైలారి,జాతీయ సంగోల్లి రాయన్న సంగం ఆలురు తాలూక ప్రధాన కార్యదర్శి మంజునాథ్,మాదాసి కురువ కమిటీ మెంబర్ గోపాల్,సిదప్ప,నరేగల్ల,ఆలూరు తాలూకా,మండల కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author