PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే విరుపాక్షి

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆలూరు : ఈరోజు కర్నూలు జిల్లా కలెక్టర్ని మర్యాదపూర్వకంగా కలిసినా ఎమ్మెల్యే విరుపాక్షి ముందుగా ఆయనను సన్మానించరు. అదేవిధంగా ఆలూరు నియోజకవర్గం లో ఉండే ప్రధాన సమస్యలను ఆయనకు వివరించారు  తాగునీరు అయితేనేమి రోడ్ల అయితే నేమి సాగునీటి సమస్య అయితే నేమి కలెక్టర్ కి వివరించడం జరిగింది మా నియోజకవర్గంలో ప్రధాన సమస్య నీరు రోడ్లు ముఖ్యంగా ఆస్పరి మండలంలో అయితే కనీసం త్రాగడానికి చుక్క నీరు లేని గ్రామ లు ఉన్నాయి  అక్కడ ప్రజలు తాగునీటి సమస్యఎదుర్కొంటున్నారు.  అదేవిధంగా హోలగుందా మండలంలో రోడ్ల సమస్య భారీ తీవ్రంగా ఉంది అక్కడ జనాలు ప్రయాణించాలంటేనే నానా అవస్థలు పడుతున్నారు అదేవిధంగా చిప్పగిరి మండలంలో హంద్రీనీవా కాలువకు తూము ఏర్పాటు చేసి ఏ బి సి కెనాల్ ద్వారా అక్కడ రైతులను ఆదుకుంటారని అదేవిధంగా ఆలూరు హలహార్వి మండలంలో జింకల బెడద ఎక్కువగా ఉండడం వల్ల జింకల పార్క్ ఏర్పాటుచేసి అక్కడ ఉన్న రైతులను ఆదుకుంటారని ఆయనకు వివరించడం జరిగింది కలెక్టర్  అన్ని సౌధానంగా విని పరిష్కరిస్తామని ఎమ్మెల్యే విరుపాక్షికి తెలపడం జరిగింది.

About Author