PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దిశ హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణకు ప్రతిష్టాత్మకమైన కమాండేన్షన్ డెస్క్ అవార్డు

1 min read

ఏలూరు జిల్లాలో పనిచేస్తున్న పలువురు కి ఎస్పి డి.మేరీ ప్రశాంతి అవార్డులు అందజేత

వృత్తిని దైవంగా భావించి, నిబద్ధతతో బాధ్యతాయుతంగా పనిచేయాలి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి ప్రతిష్టాత్మకమైనటువంటి కమాండేషన్ డెస్క్ అవార్డ్స్ 2022 పురస్కరించుకొని ఏలూరు జిల్లాలో పనిచేస్తున్న ఏలూరు జిల్లా ఎస్పీ  డి.మేరీ ప్రశాంతి ఐపీఎస్ వారికి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ చేసే వృత్తిని దైవంగా భావించి నిబద్ధతతో, ఆత్మవిశ్వాసంతో, బాధ్యతయుతంగా పనిచేస్తే గుర్తింపు దానంతట అదే వస్తుందన్నారు.అవార్డులు అందుకున్న  డి సి ఆర్ బి లో పనిచేస్తున్న ఏఎస్ఐ రమేష్ బాబు, ఏలూరు డిఎస్పీ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, ఏలూరు సిసిఎస్ లో పనిచేస్తున్న లక్ష్మణ్, దిశ స్టేషన్ మహిళా హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ, కానిస్టేబుల్ ఎన్ బాల కృష్ణ , ఎల్ లక్ష్మీనారాయణ కానిస్టేబుల్, ఎం బాలకృష్ణ లకు ప్రతిష్టాత్మక అవార్డు పొందిన నేపథ్యంలో ఈరోజు ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ  యొక్క చేతుల మీద అవార్డులను అందజేసి సిబ్బంది యావన్మందిని అభినందించారు.

About Author