PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మైనర్ బాలిక కేసులో ముగ్గురు బాలురు అదుపులోకి..  ఇద్దరు వ్యక్తులు అరెస్టు : జిల్లా ఎస్పీ  

1 min read

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామం నుండి ఒక 9 సం. ల బాలిక అడుకోవటానికి పార్కు కు వెళ్ళి తిరిగి ఇంటికి రానందున ఆమె తండ్రి సంగెం చిన్న మద్దిలేటి, పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ ఇచ్చారు.దానిపై అదే రోజు మిస్సింగ్ కేసు నమోదు చేయడమైనది.అప్పటినుండి మైనర్ బాలిక ఆచూకీ కనిపెట్టుట కొరకు నంద్యాల జిల్లా SP  ఉత్తర్వుల మేరకు ఆత్మకూరు DSP  అధర్వంలో గాలింపు చర్యలు చేపట్టడమైనది.విచారణ చేస్తుండగా తప్పిపోయిన అమ్మాయి పై ముగ్గురు మైనర్ అబ్బాయిలు హత్యాచారం చేసి అమ్మాయిని చేతులతో గొంతు నులుమి చంపివేసినట్లు తరువాత కొంత దూరం సైకిల్ పై మరియు మోటార్ సైకిల్ పై ఎక్కించుకొని అలాగే ఆ అమ్మాయి శవాన్ని కృష్ణా నది బ్యాక్ వాటర్ లో వారి తండ్రుల సహాయంతో శవానికి రాయి కట్టి నదిలో పడవేసినట్లు ప్రాథమిక దర్యాప్తు లో తెలిసినది.దానిపై కర్నూల్ DIG , నంద్యాల జిల్లా SP  మరియు ADDL. SP,  ముచ్చుమర్రి గ్రామం లోనే మకాం వేసి గాలింపు చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించినారు.ఈ గాలింపు చర్యలలో CI స్థాయి అధికారులను 6 teams గా ఏర్పాటు చేసి గజ ఈత గాళ్ల ద్వారా మరియు SDRF మరియు NDRF టీమ్, లను, 06 స్పెషల్ పార్టీ బృందాలు,డాగ్ స్క్వాడ్, డ్రోన్ కెమెరాలు, టెక్నికల్ టీమ్ లను రంగం లోకి దింపి గాలింపు చర్యలు చేపట్టగా మైనర్ బాలిక ఆచూకీ లభ్యం కాలేదు. ముగ్గురు మైనర్ బాలురను వారి తల్లి తండ్రుల ద్వారా అదుపులోనికి తీసుకోవడమైనది. అలాగే ఆ అమ్మయి శవాన్ని  లభ్యం కాకుండా నదిలో పడవేసినట్లుగా ప్రాథమిక దర్యాప్తు లో తెలిసినందున కాటం. యోహన్, బొల్లెద్దుల .సద్గురుడు లను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించడమైనది.పై బృందాలన్నియు అమ్మాయి ఆచూకీ కొరకు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

About Author