PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మంత్రాలయం ఆర్టీసీ బస్టాండ్ లో గుండెపోటుతో భక్తుడు మృతి

1 min read

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం:  నియోజకవర్గ కేంద్రమైన మంత్రాలయం ఆర్టీసీ బస్టాండ్ లో బెంగళూరు కు చెందిన ఓ భక్తుడు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. ఎస్సై గోపినాథ్ తెలిపిన వివరాల ప్రకారం బెంగళూరు సిటీ కి చెందిన ప్రభుకుమార్ (55) అనే భక్తుడు రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చాడు. అయితే రాత్రి బస్టాండ్ లో నిద్ర పోతున్న సమయంలో గుండె పోటు రావడం తో మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి ఆధార్ కార్డు ఆధారంగా మృతి ని బంధువులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

About Author