PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహానందిలో ప్రైవేట్ లాడ్జిల్లో తనిఖీలు

1 min read

పల్లెవెలుగు వెబ్ మహానంది:  మహానది క్షేత్రంలోని ప్రైవేటు లాడ్జిల్లో మహానంది ఎస్సై జి నాగేంద్ర ప్రసాద్ తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా లాడ్జి యజమానులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. లాడ్జిల్లో ఆ సాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. లాడ్జిల్లో బసచేసే వారి వివరాలు నమోదు చేసుకోవడంతోపాటు సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసే విధంగా సంబంధిత లాడ్జి యజమానులు చర్యలు తీసుకోవాలని ఏదైనా సంఘటనలు జరిగితే లాడ్జి యజమానులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా వచ్చి లాడ్జిలో మఖాం వేస్తే వెంటనే తమకు సమాచారం అందజేయాలని ఎస్సై జి నాగేంద్రప్రసాద్ లాడ్జి యజమానులకు సూచించారు.

About Author