PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రామాలలోని సమస్యలు పరిష్కరించుకుందాం : ఎంపీడీవో

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలీ: గ్రామాలలోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుందామని ఎంపీడీవో సాయి మనోహర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ప్యాపిలి మండల పరిధిలోని అలేబాత్ తాండ గ్రామంలో ఆయన సందర్శించి గ్రామంలోని ప్రజలను సమస్యలపై హారతిశారు. అలాగే త్రాగునీరు, డ్రైనేజీ, వీధిలైట్లు,పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను కోరారు. గ్రామంలోని డ్రైనేజీని చూసి పరిశుభ్రంగా ఉంచాలని ఆయన తెలిపారు. గ్రామంలోని హాస్టల్లోనూ విజిట్ చేసి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి విద్య బోధన అందించాలని, అలాగే మెనూ ప్రకారం భోజనం పెట్టాలని అన్నారు. గ్రామంలో సంబంధిత సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకుని రావాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

About Author