PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అభాగ్యులకు అండగా టిడిపి ప్రభుత్వం

1 min read

వీరభద్ర గౌడ్ టిడిపి ఇన్ ఛార్జ్     

పల్లెవెలుగు వెబ్  ఆలూరు:  ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారం చేపట్టిన నెలకే  3000 పెన్షన్ 4 వేలకు పెంచుతూ ఎన్నికల హామీని నెరవేర్చిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడు ది అన్ని ఆలూరు తెదేపా ఇన్ చార్జ్ వీరభద్ర గౌడ్ అన్నారు. పింఛన్ల పంపిణీలో భాగంగా ఆయన ఆలూరులో పట్టణంలోపాల్గొన్నారు.ఆలూరు పట్టణములో పార్టీలకు అతీతంగా కోటవీధి లో లివర్ ట్రాన్సలేషన్ బాధితురాలు వీరబద్రి కూతురు హరికకు 10.000  రూపాయలు ఎన్టీఆర్ భరోసా పింఛను అందచేశారు.  పేదల సంక్షేమానికి తెదేపా ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కేవలం వైకాపా నాయకులు తెదేపా పై బురద జల్లే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇలాంటి ఎన్ని ప్రయత్నాలు చేసినా తమ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, నందమూరి బాలకృష్ణ అభిమానులు,బిజెపి నాయకులు, జనసేన కార్యకర్తలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author