PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వ‌ర‌ద‌ బాధితుల స‌హాయార్ధం కోటి రూపాయలతో 10 వేల కిట్లు సిద్ధం..

1 min read

మంత్రి టి.జి భ‌ర‌త్, టిడిపి జిల్లా అధ్య‌క్షుడు తిక్కారెడ్డి

పల్లెవెలుగు వెబ్ విజయవాడ: విజ‌య‌వాడ వ‌ర‌ద బాధితుల‌కు అందించేందుకు 10 వేల నిత్యావసర సరుకుల కిట్లు సిద్ధం చేసిన‌ట్లు రాష్ట్ర ప‌రిశ్రమ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్, తెలుగుదేశం పార్టీ క‌ర్నూలు జిల్లా అధ్యక్షుడు పాల‌కుర్తి తిక్కారెడ్డి తెలిపారు. మౌర్య ఇన్‌లోని కార్యాల‌యంలో వారు మాట్లాడుతూ క‌ర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీలు, నాయ‌కుల స‌హ‌కారంతో ప‌ది వేల కిట్లు త‌యారుచేసిన‌ట్లు చెప్పారు. ఒక్కో కిట్‌లో 5 కేజీల బియ్యం, 1 కేజి కందిప‌ప్పు, 1 కేజీ చక్కెర‌, ఉప్మార‌వ్వ‌, కారంపొడి త‌దిత‌ర నిత్యావసర వ‌స్తువులు ప్యాక్ చేసి పెట్టామ‌న్నారు. ఒక కోటి రూపాయ‌లు ఖ‌ర్చు చేసి ప‌ది వేల కిట్లను సిద్ధం చేశామ‌ని చెప్పారు. మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ‌లో వీటిని ప‌ది వేల కుటుంబాల‌కు అంద‌జేయ‌నున్నట్లు తెలిపారు. వ‌ర‌ద బాధితులను ఆదుకునేందుకు స్వచ్చందంగా ముందుకు వ‌చ్చి స‌హ‌కారం అందించిన పార్టీ కార్యక‌ర్తలు, దాత‌ల‌కు వీరు ప్రత్యేక ధ‌న్యవాదాలు తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *