సైబర్ మోసంతో పోగొట్టుకున్న డబ్బులు ఇప్పించిన ఎస్పీ
1 min read

సోషల్ మీడియా లో వచ్చిన ప్రకటనలు చూసి మహిళలు సైబర్ మోసంతో పోగొట్టుకున్న డబ్బులు
బాధిత మహిళకు రూ: 2,56,000/- లు వెనక్కి ఇప్పించిన ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : సోషల్ మీడియాలో వచ్చిన ప్రకటన చూసి మహిళలు సైబర్ మోసంతో పోగొట్టుకున్న డబ్బులు బాధిత మహిళలకు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ బాధిత మహిళలకు తిరిగి ఇప్పించారు. ఏలూరు 2 టౌన్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, ఎస్ఐ మధు వెంకట రాజా,ఏలూరు జిల్లా సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ దాసు,మహిళా ఎస్ఐ వల్లి పద్మ ,ఏలూరు జిల్లా ఎస్పీకె. ప్రతాప్ శివ కిషోర్,ఐపీఎస్ ఆదేశాల మేరకు, ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదు అయిన ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసు (Cr. No: 290/2024 – సెక్షన్ 318(4) BNS, 66(C)(D) IT Act)లో బాధిత మహిళ పోగొట్టుకున్న రూ. 2,56,000/- మొత్తాన్ని పోలీసులు తిరిగి ఆమెకు అందజేశారు.గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బాధిత మహిళకు డబ్బును జిల్లా ఎస్పీ స్వయంగా అందజేశారు.కేసు వివరాలు: బాధిత మహిళ సోషల్ మీడియాలో వచ్చిన WhatsApp, Telegram గ్రూపుల ద్వారా ఆకర్షితమై, “ట్రేడింగ్, బిట్కాయిన్, క్రిప్టోకరెన్సీ” లాంటి పేర్లతో ఎక్కువ లాభాలు వస్తాయనే ఆశతో డబ్బులు పెట్టుబడి పెట్టింది.ఈ ప్రక్రియలో రూ. 2,56,000/- మోసపోయిన ఆమె, వెంటనే 1930 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయగా,ఏలూరు 2 టౌన్ పోలీసులు,ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ ,ఎస్ఐ మధు వెంకటరాజా, డిస్ట్రిక్ట్ సైబర్ సెల్ సహకారంతో ఫ్రాడ్ను గుర్తించి బాధితురాలికి డబ్బు తిరిగి పొందించారు.సోషల్ మీడియా ప్రకటనలపై నమ్మకం ఉంచి మోసపోయాము. కానీ జిల్లా ఎస్పీ తక్షణం స్పందించి, మా సమస్యను పరిష్కరించి, మా డబ్బును మాకు తిరిగి అందించారని ఆయనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము,” అని బాధితురాలు పేర్కొన్నారు.ఎస్పీకె. ప్రతాప్ శివ కిషోర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సోషల్ మీడియా ద్వారా వచ్చే నకిలీ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్కి ఎవ్వరూ బలికాకూడదు. అసలు లేనివాటి మీద ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పే ప్రకటనలు అన్ని నకిలీ కావచ్చు.మీ వద్ద ఇలాంటి సందేహాస్పద లింకులు, గ్రూపులు, సమాచారం ఉంటే వెంటనే 1930 నెంబర్ లేదా దగ్గర పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వండి.బాధితుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. ప్రతి రూపాయి మిమ్మల్ని రక్షించేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉంది.”

