PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కొందరు స్వలాభం కోసం ఎన్డీఏ కూటమిలో చేరే ప్రయత్నాలు చేస్తున్నారు

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద:  టిడిపి సీనియర్ నాయకులు పంపాపతి ఎర్రి స్వామి మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి యొక్క ఓటమినీ కోరుకున్న కొంతమంది స్వార్థపరులు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిందని వారి స్వలాభం కోసం ఎన్డీఏ కూటమిలో చేరే ప్రయత్నాలు చేస్తున్నారని అలాంటి వారిని పార్టీలో చేర్చుకోబోమని హెూళగుంద మండల తెదేపా నాయకులు,కార్యకర్తలు అన్నారు. స్థానిక సిద్దేశ్వర గుడి ఆవరణం నందు కూటమి నాయకులు,   కార్యకర్తలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం,జనసేన, బిజెపి నాయకులు మాట్లాడుతూ కొంతమంది వైసిపి నాయకులు చేరుతున్నట్లు  గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ప్రకటించారు.కానీ చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేయడం కోసం అహర్నిశలు కష్టపడిన నాయకులకు, కార్యకర్తలకు గుర్తింపు లేకుండా పోతుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం జనసేన కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసినవారు ఇప్పుడు పార్టీలో చేరుతామంటే ఎలా అని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో రాజా పంపన గౌడ్, చిదానంద, రైస్ మిల్ మురళి, దిడ్డి వెంకటేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *