PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైభవం.. నిమజ్జనోత్సవం..

1 min read

గంగమ్మ ఒడి చేరిన.. 63 అడుగుల భారీ గణపతి

  • ప్రత్యేక పూజలు చేసి… నిమ్జనోత్సవంలో పాల్గొన్న ఎస్వీ దంపతులు

కర్నూలు, పల్లెవెలుగు: నగరంలోని పెద్ద మార్కెట్​ తుంగాతీరాన దత్తాత్రేయ స్వామి అవతారంలో వెలిసిన 63 అడుగుల భారీ గణపతి నిమజ్జనోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. భక్త జనసందోహం…కోలాటం మధ్య భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు. ముందుగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్​ రెడ్డి, ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ మాజీ అధ్యక్షురాలు ఎస్ వి విజయ మనోహరి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హారతి ఇచ్చారు.  11 రోజులపాటు ప్రత్యేక పూజలు అందుకున్న మహాగణపతిని గంగమ్మ ఒడిలో చేర్చారు. ప్రజల కోర్కెలు ఫలించి… మేలు జరగాలని దేవుడిని కోరినట్లు ఎస్వీ దంపతులు తెలిపారు. కార్యక్రమంలో మేయర్​ రామయ్య,   గణేష్ ఉత్సవ సమితి సభ్యులు మహాగణపతి మండప కమిటీ సభ్యులు ప్రజలుభారీ సంఖ్యలో పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *