PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెదేపా శ్రేణుల సంబరాలు…

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : హోళగుంద మండల కేంద్రములో ఆలూరు నియోజకవర్గ తెదేపా ఇంచార్జీ గా వీరభద్ర గౌడ్ ను ఖరారు చేయడంతో హోళగుంద మండల తెదేపా నాయకులు,కార్యకర్తలు బస్టాండ్ నందు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. తమ అభిమాన నాయకుడు వీరభద్ర గౌడ్ ను ఇన్చార్జిగా ప్రకటించడం పట్ల చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం తెదేపా సీనియర్ నాయకులు రాజా పంపన్న గౌడ్, ఎర్రి స్వామి మాట్లాడుతూ నిజాయితీ, నిబద్ధత కలిగిన నాయకుడు వీరభద్ర గౌడ్ ను ఆలూరు ఇంచార్జ్ గా నియమించడం హర్షనీయమని అన్నారు. ఆలూరు అభివృద్ధి కోసం వీరభద్ర గౌడ్ అహర్నిశలు పరిశ్రమిస్తున్నారని, ఆలూరు అభివృద్ధికి తన సాయశక్తుల కృషి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు అబ్దుల్ సుభాన్, మురళి, కాడప్ప, వీరన్న గౌడ్,పంపాపతి, దిడ్డి వెంకటేష్, దుర్గయ్య, తిమ్మారెడ్డి,అబ్దుల్ రహిమాన్, ముళ్ళ మోయిన్, తిప్పన్న, ఆంజనేయులు అల్తాఫ్ సుభాన్, సలీం, తెదేపా నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *