PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పార్టీకి జనార్దన్ రెడ్డి సేవలు ఎనలేనివి..

1 min read

పలుచాని కుటుంబానికి పార్టీ అండ:మాండ్ర

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పగిడ్యాల మండల కన్వీనర్ పలుచాని మహేశ్వర్ రెడ్డి కుటుంబాన్ని నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి పరామర్శించారు.నంద్యాల జిల్లా పగిడ్యాల మండల పరిధిలోని ప్రాతకోట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పలుచాని జనార్దన్ రెడ్డి అనారోగ్యంతో ఈనెల 8 న మృతి చెందిన సంగతి తెలిసిందే.విషయం తెలుసుకున్న శివానందరెడ్డి మరియు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి వారు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. జనార్దన్ రెడ్డి పార్టీకి ఎనలేని కృషి చేశారని ఆయన సేవలను శివానందరెడ్డి గుర్తు చేశారు.పార్టీకి మొదటి నుంచి  విధేయుడుగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉండే వారని అంతేకాకుండా ప్రజా సమస్యల కోసం ప్రజల పక్షాన పోరాడే వ్యక్తి జనార్దన్ రెడ్డి అని ఆయన అన్నారు.తర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వారికి ధైర్యం చెప్పారు.పలుచాని కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని శివానందరెడ్డి వారికి భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో మిడుతూరు మండల నాయకులు వంగాల శివరామిరెడ్డి,విజయవాణి పాఠశాల కరస్పాండెంట్ సుబ్బారెడ్డి,జనార్ధన్,ప్రాతకోట టిడిపి నాయకులు వెంకటరెడ్డి,రమణ తదితరులు ఉన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *