PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వరద బాధితులకు రూ 21 లక్షల 80 వేలు విరాళం

1 min read

చంద్రబాబు, లోకేష్ లకు చెక్ అందించిన రాఘవేంద్ర రెడ్డి

పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం :  మంత్రాలయం నియోజకవర్గం తరుపున విజయవాడ వరద బాధితులకు రూ 21 లక్షల 80 వేల రూపాయలు విరాళంగా అందించడం జరిగింది. వరద బాధితులకు అండగా  బుధవారం విజయవాడ లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ,మంత్రి నారా లోకేష్ లకు రూ 21.80 లక్షల చెక్కును మంత్రాలయం టిడిపి నియోజకవర్గ ఇంచార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల గత కొద్ది రోజుల క్రితం విజయవాడ లో వరద ముప్పుతో ఎన్నో ఇబ్బందులతో పాటు అనేకమంది చనిపోవడం జరిగిందని తెలిపారు. తినడానికి తిండి లేక, పడుకోవడానికి స్థలము లేక, నిద్రలేక ఎన్నో కష్టాలను విజయవాడ వాసులు భరించడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయవాడ సహా పలు వివిధ ప్రాంతాల్లో వచ్చిన వరదల తీవ్రంగా నష్టపోయిన వరద బాధితులకు మన వంతుగా మంత్రాలయం  నియోజకవర్గంలోని కౌతాళం మండల నాయకులు చూడి ఉలిగయ్య  ,వెంకటపతి రాజు, కోసిగి మండల నాయకులు ముత్తురెడ్డి, పల్లెపాడు రామిరెడ్డి , తోవి రామకృష్ణ  , జ్ఞానేష్ , నాడిగినేని అయ్యన్న,వక్రని వెంకటేష్, పెద్దకడుబుర్ మండల నాయకులు నరవ రమాకాంత్ రెడ్డి, బసలదొడ్డి ఈరన్న .మంత్రాలయం మండల నాయకులు అశోక్ రెడ్డి, వరద రాజు తో పాటు నాలుగు మండలల నాయకులు,కార్యకర్తలు, ప్రజలు అందజేసిన ఇరవై ఒక్క లక్షల యానాభై వేల రూపాయల (21.80) చెక్కును ఉండవల్లి నివాసం లోని ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లకు అందించడం జరిగిందని తెలిపారు. ఈ కౌతాలం మండలం టిడిపి నాయకులు చూడి ఉలిగయ్య తదితరులు ఉన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *