PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డ్రైనేజీ పనులను పరిశీలించిన మున్సిపాలిటీ కమిషనర్..

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పట్టణంలో కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పట్టణాన్ని స్వచ్ఛ పట్టణంగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నందికొట్కూరు మున్సిపాలిటీ కమిషనర్ బేబీ మున్సిపాలిటీ కార్మికులతో అన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో పట్టణంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న పనులను   శుక్రవారం తెల్లవారు జామునే కమిషనర్ 5:30 కు వెళ్లి శానిటేషన్ పనులను పరిశీలించారు.పట్టణంలోని కేజీ మరియు మిడుతూరు రహదారి పనులు,పొట్టి శ్రీరాములు విగ్రహం ఎదురుగా బ్రిడ్జి దగ్గర ఉన్న మురికి కాలువను ఆమె పరిశీలించారు.పట్టణంలో ప్రధాన రహదారులపై ఉన్న చెత్తా చెదారాన్ని కార్మికులు శుభ్రం చేశారు.ప్రతిరోజు ఉదయాన్నే వచ్చి మురికి కాలువల్లో మరియు రోడ్లపై ఉన్నటువంటి వాటిని తొలగించి పట్టణాన్ని శుభ్రంగా ఉంచాలని కమిషనర్ అన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *