PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్యా శాఖ అధికారులు అమ్ముడుపోయరా…!

1 min read

ఎంక్వయిరీని తప్పుదోవ పట్టించినటువంటి  విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేయాలి..

పీ ఎస్ యు జిల్లా కార్యదర్శి సురేష్

పల్లెవెలుగు వెబ్​ ఎమ్మిగనూరు: నందవరం మండలం పూలచింత గ్రామంలో ఎంపీయూపీ పాఠశాలలో విద్యార్థులను కులం పేరుతో హెచ్ఎం నరేష్ కుమార్,టీచర్ పవన్ కుమార్ ఇద్దరు  దూషించడం జరిగింది ఇద్దర్నీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చి కానీ పవన్ మాత్రమే సస్పెండ్ చేసి హెచ్ఎం నరేష్ కు వత్తాసు పలకడం ఏంటని ఈరోజు పి ఎస్ యూ ఆధ్వర్యంలో నందవరం విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా పి ఎస్ యు జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ గత 17రోజుల క్రితం కులం పేరుతో దూషించినటువంటి సంఘటన ఆయా పేపర్లో రావడంతో మండల విద్యాశాఖ అధికారులు హెచ్ఎం నరేష్ ని పవన్ కుమార్ ని విచారణ జరగగా విచారంలో భాగంగా విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ ముందు బయటాయించి మండల విద్యాశాఖ అధికారులకు పూసగుచ్చినట్లు విచారణలో తమ సమస్యను తెలిపినా కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు మాత్రం టీచర్ పవన్ కుమార్ ని సస్పెండ్ చేసి హెచ్ఎం నరేష్ గారు ఇచ్చినటువంటి ముడుపులను జిల్లా విద్యాశాఖ అధికారులు ఆయన సస్పెండ్ చేయకపోవడం విద్యాశాఖ కే  సిగ్గుచేటు అని విద్యార్థులకు కుల వివక్షత చూపితే ఉపాధ్యాయులను కాపాడడం ఏంటి అని ఎంక్వయిరీల పేరుతో విద్యార్థులను భయోందానాలను గురి చేయడం ఏంటని ఉపాధ్యాయులను కాపాడుకోడానికా లేదంటే విద్యార్థుల జీవితాలను బానిసత్వంలోకి నెట్టి వేటి కొరక అనివారు ఆవేదన వ్యక్తం చేశారు విచారణ తప్పుదోవ పట్టిస్తున్నటువంటి ఎంక్వయిరీ ఆఫీసర్లు ఎంక్వయిరీ కి  వేయకుండా న్యాయపరమైనటువంటి ఆఫీసర్లు వేసి తక్షణమే పవన్ కుమార్ టీచర్ ని చేసిన విధంగా హెచ్ఎం నరేష్ కూడా సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు లేనిపక్షంలో దశల వారిగా ఉద్యమాలకు దారితీస్తామని వారు హెచ్చరించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *