PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నేడు పిజిఆర్ఎస్ ద్వారా ప్రజా  విజ్ఞప్తుల స్వీకరణ

1 min read

జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా, ఐ.ఎ.ఎస్

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: ఈ నెల 23వ తేదీ సోమవారం నంద్యాల పట్టణం కలెక్టరేట్ లోని సెంటినరీ హాలులో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమం ద్వారా ప్రజల నుండి అర్జీలు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ శ్రీమతి రాజకుమారి గణియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రజా సమస్యల పరిష్కారానికి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించే ప్రక్రియను ”పబ్లిక్‌ గ్రివియన్స్‌ రెడ్రెస్సల్‌ సిస్టం (పి జి ఆర్‌ ఎస్‌)” ద్వారా చేపట్టనున్నట్లు తెలిపారు.ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే ”పబ్లిక్‌ గ్రివియన్స్‌ రెడ్రెస్సల్‌ సిస్టం” కార్యక్రమానికి ఈ నెల 23వ తేదీ ఉదయం 9-30 గంటలకు జిల్లాధికారులందరూ హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు.అలాగే జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో కూడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు.  

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *