PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

లక్ష మందితో  సభ నిర్వహిస్తాం …

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  వాల్మీకి బోయల ఎస్టీ రిజర్వేషన్ పునరుద్ధరణ కోసం త్వరలో లక్ష మందితో సభ నిర్వహిస్తామని ఏపీ వాల్మీకి బోయ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జక్కుల శ్రీనివాసులు, క్రాంతి నాయుడు పేర్కొన్నారు. ఆదివారం జిల్లా పరిషత్ లోని వాల్మీకి బోయల ఎస్టీ అంశంపై రాష్ట్రస్థాయి వర్క్ షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ   వాల్మీకి బోయలకు ఎస్టి ఇవ్వాలని గత వైసిపి, టిడిపి  ప్రభుత్వాలు  అసెంబ్లీ ఆమోదం తెలిపిందని గుర్తు చేశారు.  కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి త్వరలో ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని కోరారు.  ఆంధ్రప్రదేశ్ మైదాన ప్రాంత నాన్ ఏజెన్సీ వాల్మీకి బోయలకు ‌ ఆర్టికల్ 14,15,16,29(1),341,342,371(డి) ప్రకారం రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందన్నారు.  కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వాల్మీకి అర్జున్,బాలమదిలేటి,  తలారి కృష్ణ, శివ, సత్రం రామకృష్ణ, రవి, పెద్దయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *