PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రహదారులని బాగు చేయాలి… కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు:   ఎమ్మిగనూరు ఎమ్మిగనూరు నియోజకవర్గం లోని ప్రధాన రహదారులైన ఎమ్మిగనూరు -కోడుమూరు, ఎమ్మిగనూరు- గూడూరు, ఎమ్మిగనూరు- కోసిగి మరియు పలు రహదారులని బాగు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం మదర్ తెరిసా బీఈడీ కళాశాల దగ్గర ధర్నా నిర్వహించడం. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాశీం వలి, విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు వీరేష్ యాదవ్ మాట్లాడుతూ ఈ రహదారులపై వేలాదిమంది ప్రతిరోజు ఈ ప్రధాన రహదారుల గుండా ప్రయాణిస్తుంటారని, రహదారులు గుంతలు పడి చాలా దెబ్బతిన్నాయని, అద్వానంగా తయారయ్యిందని తెలిపారు. రహదారులు  చింద బింద్రం రావడంతో ప్రజలు నరకయాతన పడుతున్నారని ,నిత్యం వేలాది వాహనాలు ఈ ప్రధాన రహదారులపై అధికారులు ప్రజలు విద్యార్థులు ప్రయాణిస్తున్నారని ఇలాంటి ప్రధాన రహదారులని  ఆర్ అండ్ బి అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం చాలా దారుణమని తెలిపారు. ద్విచక్ర వాహనదారులు గుంతలు పడిన రోడ్లపై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వర్షాకాలం రావడంతో రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు.రహదారుల్ని బాగ చేయలేని తక్షణంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని తెలిపారు. స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు ఈ అంశంపై స్పందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ కాంగ్రెస్ నాయకులు దాదాకలందర్,బనవాసి జయపాల్,నిషార్, సోమేశ్, అక్బర్,మెహిబూబ్,కుష్క సయ్యద్,కుమార్,అజయ్,ఆసిన్ ,బడేసబ్ ,విజయ్ తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *