PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బడుగు బలహీన వర్గాల అభివృద్ధే  ప్రభుత్వ లక్ష్యం

1 min read

ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు:  చెన్నూరు  బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి వారి సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలు తీసుకురావడం జరుగుతుందని, ఈ ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నదని ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ అన్నారు. సోమవారం గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ సిద్దిగారి వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన “ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే” కార్యక్రమంలో ఎంపీడీవో మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు అవుతున్న సందర్భంగా ప్రభుత్వం ఈ వంద రోజులలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడగానే మెగా డీఎస్సీ తో పాటు, పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇది పేద ప్రజల ప్రభుత్వమని ప్రజలకు మెరుగైన పాలన అందించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. రాబోవు రోజులలో ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటిని అధిగమించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. అలాగే ప్రజా అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ కో ఏఈ రామలింగారెడ్డి. కార్యదర్శి రామ సుబ్బారెడ్డి, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కల్లూరు విజయభాస్కర్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇంది రెడ్డి శివారెడ్డి, గుమ్మల్ల మల్లికార్జున రెడ్డి, ఆకుల ప్రసాద్ బాబు, షబ్బీర్, గ్రామ సచివాలయ సిబ్బంది, అంగన్వాడి కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *