PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అట్టహాసంగా ప్రారంభమైన నియోజకవర్గ స్ధాయి స్కూల్ గేమ్స్

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : మంగళవారం ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో పత్తికొండ నియోజకవర్గ స్థాయి టోర్నమెంట్ కమ్ సెలెక్షన్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా పత్తికొండ నియోజకవర్గ M.L.A K.E.శ్యాంబాబు, డివిజన్ DSP వెంకటరామయ్య, తెలుగుదేశం సీనియర్ నాయకులు K.సాంబశివ రెడ్డి, కర్నూల్ జిల్లా ఏపీ పి.ఈ.టి అండ్ ఎస్.ఎ పి.ఈ సెక్రటరీ చందు నాయక్ హాజరయ్యారు. క్రీడాకారులను ఉద్దేశించి ఎమ్మెల్యే కే.ఈ. శ్యాంబాబు మాట్లాడుతూ, క్రీడలలో ప్రతి విద్యార్థిని విద్యార్థులు పాల్గొని నియోజకవర్గానికి, జిల్లా కు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొనిరావాలి అని కోరారు. డీస్పీ వెంకట రామయ్య మాట్లాడుతూ, విద్యార్థులు క్రీడలు ఆడటం వలన శారీరకంగా దృఢత్వమే కాకుండా మానసిక ఒత్తిడిని తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు. అలాగే యువత చెడు అలువాట్లకకు దూరంగా ఉండాలని  చెప్పారు. ఎమ్మెల్యే శ్యాంబాబు ని పత్తికొండ వ్యాయమ ఉపాధ్యాయులు సంఘం తరుపున ఘనంగా సన్మానించారు. అతిధిలకు సెయింట్ జోసెఫ్ పాఠశాల మార్చ్ పాస్ట్ బ్యాండ్ ద్వారా ఘనంగా స్వాగతం పలికారు. ఈ క్రీడలలో దాదాపు 5 మండలాల పాఠాశాల క్రీడాకారులు కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, యోగ, చెస్ మరియు అథ్లెటిక్స్ లో పాల్గొన్నారు. బాలికలకు బుధవారం సెలెక్షన్స్ నిర్వహిస్తారని ఇంచార్జ్ లు తెలిపారు. ఈ క్రీడలలో ఎంపికైన విద్యార్థులు సెప్టెంబర్ చివరిలో జరగబోయే జిల్లా స్థాయి క్రీడలలో పాల్గొంటారని ఇంచార్జ్ పి.డి.లు చందు నాయక్, వి.రంగస్వామి, రాజేష్ ఆగోల లు తెలిపారు. దాదాపు 1000 మంది విద్యార్థిని, విద్యార్థులకు ఎమ్మెల్యే శ్యాంబాబు భోజన వసతి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో  తెలుగుదేశం రాష్ట్ర యువత అధికారిక ప్రతినిధి బత్తిని లోకనాథ్ మరియు తెలుగుదేశం మాజీ జడ్పీ చైర్మన్ బత్తిని వెంకటరాముడు,మనోహర్ చౌదరి, తిమ్మయ్య చౌదరి, వెంకటపతి, సుంకన్న, జూనియర్ కాలేజి ప్రిన్సిపాల్ బేగం, మండల విద్యాశాఖ అధికారులు జి. రమేష్ బాబు, తిమ్మారెడ్డి, హెచ్.యం. వి.మాలతి, వ్యాయామ ఉపాధ్యాయులు పాండు, సంజప్ప, SP.రంగస్వామి, మధుసూదన్, హనుమన్న,అంజి, హనుమంతమ్మ, రుక్మిణి, గోకుల్ సింగ్, రంగస్వామి, నరసన్న, మధుబాబు, రాజశేఖర్, బాబు, సలోమి, రాజేశ్వరి, జీయర్,శేఖర్, నరసింహులు, రాము, వార్డెన్ నాగరాజు, ఉపాధ్యాయులు లక్ష్మణ్, మారుతి తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *