PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉత్సాహంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

1 min read

ఏపీ ఎన్జీవోస్ ఉద్యోగ సంఘా నాయకులు,ఉద్యోగులు

1వ తారీఖున ఉద్యోగులకు జీతాలు,పెన్షనర్లకు పెన్షన్లు అందిస్తున్న ఎన్ డి ఏ ప్రభుత్వం

జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు చోడగిరి శ్రీనివాస్ నెరుసు రామారావు ఆధ్వర్యంలో కార్యక్రమం

గత ప్రభుత్వంలో ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడ్డారు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఏపీ ఎన్జీజీవోస్ అసోసియేషన్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ కార్యదర్శి నెరుసు రామారావు ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనూహ్యమైన మెజారిటీతో గెలిచి ప్రభుత్వాన్ని  స్థాపించిన ఎన్ డి ఏ  కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా  ప్రభుత్వం చేస్తున్న ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొని ప్రభుత్వానికి మద్దతు పలికారు. ప్రజలకు మంచి చేసే ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని ప్రభుత్వ ఉద్యోగులకు 1 వ తారీఖున జీతాలు. పెన్షనర్లు కు పెన్షన్స్ ఇస్తున్న ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని  ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఈ సందర్భంగా చోడగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు తెలుపుతూ గత ప్రభుత్వంలో ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడ్డారని1 వ తారీఖున జీతాలు కూడా ఇవ్వలేదని. ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు. సరెండర్ లీవ్స్.జిపిఫ్.డిఏ లు12వ పి ఆర్ సి ఇవ్వలేదని శ్రీనివాస్ తెలిపారు. ఈ ప్రభుత్వం రాగానే అందరికి మంచి చేస్తున్నదని ఉద్యోగుల కి కూడా మంచి చేయాలని కోరారు. కార్యక్రమంలో కప్పల సత్యనారాయణ,బేగ్, మరియు మహిళ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *