NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జాతీయ అనస్థీషియా… ఆపరేషన్ థియేటర్ టెక్నాలజిస్ట్స్ డే

1 min read

కర్నూలు, న్యూస్ నేడు:  జూలై 20న జాతీయ అనస్థీషియా మరియు ఆపరేషన్ థియేటర్ టెక్నాలజిస్ట్స్ డే సందర్భంగా రాష్ట్రంలోని అనస్థీషియా టెక్నాలజిస్టులకు సిబ్బందికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.అనస్థీషియా టెక్నాలజిస్టులు అన్ని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అత్యవసర వైద్య సేవలలో కీలక పాత్ర పోషిస్తున్నారు.వెంటిలేటర్పై ఉన్న రోగులకు ఎండోట్రాకియల్ ట్యూబ్ ద్వారా శ్వాస అందించడంలో, ట్యూబ్ బ్లాకింగ్ నివారణలో, ప్రతి రెండు గంటలకు రోగుల పొజిషన్ మార్చడంలో, రైల్స్ ట్యూబ్ ఫీడింగ్, చెస్ట్ ఫిజియోథెరపీ, ఐ.వి. ఇంజెక్షన్లు వంటి అంశాలలో వారు శ్రమతో కూడిన సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా సెంట్రల్ లైన్ ఇన్ఫెక్షన్ల నివారణలో వారికి ఉన్న అవగాహన, శ్రద్ధ ప్రశంసనీయమైనది.వీరి నిరంతర సేవల వల్ల రోగులు త్వరితంగా కోలుకోవడంలో, ఇన్ఫెక్షన్లను నివారించడంలో, ప్రాణాలను రక్షించడంలో విశేష సహకారం అందుతోంది. ఈ సందర్భంగా ఈరోజు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో అనిస్తీసియా  HOD డాక్టర్ విశాల మేడం  కేకును కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అనస్థీషియా టెక్నాలజిస్టులు ఎంతో కీలకంగా పనిచేస్తున్నారని, వారి పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసేందుకు ప్రయత్నించాలనిపిస్తూ ఆసుపత్రి సూపరింటెండెంట్  లెటర్ పంపుతానని అన్నారు.డాక్టర్ డివి రామ శివ నాయక్ సర్  మాట్లాడుతూ అనస్థీషియా టెక్నాలజిస్టులు ఐసీయూ మరియు ఎమర్జెన్సీ విభాగాలలో అత్యంత కీలకంగా పనిచేస్తున్నారని, రాబోయే రోజుల్లో ఇంకా మంచి సేవలతో రోగులకు మద్దతుగా నిలవాలని ఆకాంక్షించారు.అలాగే ప్రభుత్వం వీరి పోస్టులను పెంచాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ & హెచ్.ఓ.డి డాక్టర్ విశాల , ప్రొఫెసర్ డాక్టర్ డివి రామ శివ నాయక్ , అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బాల సారయ్య రాష్ట్ర కార్యదర్శి శ్రీ ఎస్. దినేష్  అనస్థీషియా టెక్నాలజిస్టు ఉద్యోగులు విజయ్, కుమారి, రేణుక, రాధా, సుధాకర్  మరియు B.Sc., డిప్లొమా అనస్థీషియా టెక్నాలజీ విద్యార్థులు  తదితరులు పాల్గొన్నారు.

About Author