PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎంబీబీఎస్ సీటు సాధించిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందజేత

1 min read

పల్లెవెలుగు వెబ్ ఎమ్మిగనూరు:  ఎమ్మిగనూరు పట్టణంలో మల్లెల గ్రూప్ అధినేత ఆల్ఫేర్ రాజు నివాసంలో ఎంబిబిఎస్ సీట్లు సాధించిన విద్యార్థులకు మల్లెల ఆల్ ఫ్రెడ్ రాజ్ ఆర్థిక సహాయం చేయూత కడప రిమ్స్ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్. సీట్లు సాధించిన నందవరం మండలం నాగలదిన్నె గ్రామానికి చెందిన నవీన్ కుమార్ మరియు గోనెగండ్ల మండలం అల్వాల గ్రామానికి చెందిన అద్భుత కుమార్ లను ఈరోజు సామాజికవేత్త డాక్టర్ మల్లెల ఆల్ ఫ్రెడ్ రాజ్ వారి గృహంలో ఇద్దరు విద్యార్థులను సత్కరించారు.అలాగే వారి యొక్క కుటుంబ ఆర్థిక పరిస్థితులను తెలుసుకొని ఆల్ ఫ్రెడ్ రాజ్ ఇద్దరికీ 50 వేల రూపాయల చొప్పున, లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని వారి చదువు నిమిత్తం అందజేశారు .ఈ కార్యక్రమంలో ఎంఈవో. ఆంజనేయులు, టిడిపి నాయకులు కదిరికోట ఆదెన్న, మల్లెల గ్రూప్ సభ్యులు డివైఎఫ్ఐ నాయకులుఅజిత్ ,జై భీమ్ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు మత్తు,రాష్ట్ర కార్యదర్శి రవి, యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కన్వీనర్ ఉదయ్,హనుమంతు, అరుణ్ ,సతీష్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.

About Author