PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పీఆర్షీ కమిటీనీ వెంటనే నియమించాలి

1 min read

యస్. టి. యు. డిమాండ్.

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ :  ప్రభుత్వం  పీఆర్షీ కమిటీని వెంటనే నియమించాలని యస్. టి. యు నాయకులు డిమాండ్ చేశారు. గురువారం పత్తికొండ యస్. టి. యు .కార్యాలయంలో మండల అధ్యక్షుడు బలరాం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎస్ టి యు మండల ప్రధాన కార్యదర్శి చంద్ర శేఖర్ మాట్లాడుతూ, ఉపాద్యాయుల పని సర్దుబాటులోని గ్రీవెన్స్ ను వెంటనే పరిష్కరించాలని, అలాగే ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. మున్సిపల్ టీచర్లను విద్యాశాఖలో విలీనం చేశారే గాని ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదన్నారు.సి. పి. యస్.ను రద్దు చేసి ఓ పీ యస్ ను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ టి యు నాయకులు చంద్ర శేఖర్ రెడ్డి,ప్రసాద్,సూరన్న తదితరులు పాల్గొన్నారు.

About Author