PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చెన్నూరు ఎంపీడీవో గా కిరణ్ మోహన్ రావు

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా బి కిరణ్ మోహన్ రావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. కిరణ్ మోహన్ రావు సత్య సాయి జిల్లాలో ఎంపీడీవో గా బాధ్యతలు నిర్వహిస్తూ బదిలీపై ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఎంపీడీవో గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం శర్మ నందికొట్కూరుకు బదిలీపై వెళ్లడం జరిగింది. బాధ్యతలు చేపట్టిన ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు మాట్లాడుతూ, మండలంలోని అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో మండల అభివృద్ధికి తమ వంతు బాధ్యతాయుతంగా పనిచేయడం జరుగుతుందన్నారు. ఎక్కడ కూడా ప్రజలకు  ఇబ్బంది కలగకుండా  మౌలిక వసతుల కల్పనకు ఇబ్బంది లేకుండా సమస్యలను అధికమిస్తామని ఆయన  తెలిపారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *